ఈ మధ్య నేనొక ఆశ్రమానికి వెళ్ళొచ్చాను. ఆ ఆశ్రమం గేటు రోడ్డు ప్రక్కగా ఉంది. ఆశ్రమం, గేటునుంచి 200మీటర్లు కూడా ఉండదు. కాని, రోడ్డు నుంచి గేటుకి, గేటు నుంచి ఆశ్రమానికి వచ్చేసరికి నా మనసు ఇంచుమించు లోకానికి ఒక పార్శ్వం దాటింది. ఆ ఆశ్రమం మూగ చెవిటి పిల్లలకి సంబంధించినది.అంతకు ముందు ఆ పిల్లలు మాట్లాడలేరు, వినలేరు అనుకునేదాన్ని,కాని,అక్కడకి వెళ్ళాక నేను ఎంత పొరబడ్డానో అర్థమైంది.వారు మాట్లాడగలరు , వినగలరు కూడా, కాని అది పూర్తిగా స్వచ్చమైంది,కపటము లేనిది.అందుకే కాబోలు నాలాంటి ఎంతోమందికి ఆ భాష అర్థంకాదు.
ఆ క్షణాన నాకు అనిపించింది, స్వచ్చత లేని మనసుతో, కేవలం నోటితో మాట్లాడి, చెవులతో విన్నంతకాలం…. మనం మాట్లాడగలిగిన మూగవారం , వినిపించగలిగిన చెవిటివారం అని.
అప్పారావు శాస్త్రి said,
డిసెంబర్ 22, 2009 వద్ద 20:58
నిజానికి వాళ్ళలోనే ఎక్కువ ఏకాగ్రత ఉంటుందట.
సరే గానీ మీ బ్లాగ్ టైటిల్ మరింత మంచిది పెట్టడానికి ప్రయత్నిమ్చ రాదూ !! హిందువులను కిన్చపరిచినట్లుందేమో అని నా అభిప్రాయం